ప్రపంచకప్లో భాగంగా కొద్దిసేపటి క్రితం దాయాదుల పోరు మొదలైంది. మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. సాధారణంగా ఓల్డ్ ట్రెఫోర్డ్ మైదానం పేసర్లకు అనుకూలిస్తుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇక రెండు రోజుల నుండి అక్కడ వర్షం కురవడంతో పిచ్ బౌలర్లకు సహకరించనుంది. భారత ఓపెనర్లు కూడా పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. రోహిత్ కొంచెం బ్యాట్ జుళిపిస్తున్నా.. రాహుల్ పరుగులు తీసేందుకు కష్టపడుతున్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ 318. ఈ స్కోర్ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య నమోదయ్యింది. ఇదే మైదానంలో అత్యల్ప స్కోర్ 45. ఈ స్కోర్ ఇంగ్లాండ్, కెనడాల మధ్య నమోదయింది. ఇక ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచులో 286/4 అత్యధిక ఛేదనగా ఉంది.
భారత బ్యాట్స్మెన్ని పాక్ బౌలర్లు కట్టడి చేస్తారా లేక పాక్ బ్యాట్స్మెన్ని టీమిండియా బౌలర్లు కట్టడి చేస్తారా చూడాలి. కీలక మ్యాచ్ కాబట్టి బౌలర్, బ్యాట్స్మన్ల మధ్య సమరం జరగనుంది. మాంచెస్టర్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 18 మ్యాచ్ల్లో గెలవగా.. ఛేజింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్ల్లో నెగ్గింది. ఈ మైదానం ఛేజింగ్ చేసిన జట్టుకే అనుకూలంగా ఉంది.
పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లకు 42 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (31), కేఎల్ రాహుల్ (10) ఉన్నారు. వర్షం కురవకపోతే మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశముంది. చాలా మంది అభిమానులు వర్షం పడొద్దని కోరుకుంటున్నారు.
{headtohead_cricket_3_5}