తొమ్మిదో గ్రేడ్ వరకు:
డిల్లీ ఉత్తమ్ నగర్లోని విశాల్ భారతి స్కూల్లో కోహ్లీ తొమ్మిదో గ్రేడ్ వరకు చదువుకున్నాడు. తొమ్మిదో గ్రేడ్ చదువుతుండగానే 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. అనంతరం 2008లో విరాట్ సారథ్యంలో అండర్-19 కప్ గెలుచుకుంది భారత్. దీంతో 2008లో భారత జట్టులో చోటు సంపాదించాడు. అనంతరం 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.
|
మట్టి వాసన చూసి బరిలోకి:
ఆపై క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తనదైన ముద్ర వేసాడు. ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్గా ఉన్నాడు. కోహ్లీకి ఇదే మొదటి ప్రపంచకప్ కావడంతో.. మన జట్టు ప్రపంచకప్ సాధించాలని ఢిల్లీలో అతను విద్యనభ్యసించిన విశాల్ భారతి పబ్లిక్ స్కూల్.. ఓ బాక్సులో మట్టిని లండన్ పంపించింది. ఆసీస్తో మ్యాచ్కు ముందు ఆ మట్టి వాసనను చూసి కోహ్లీ బరిలోకి దిగాడు. ఆ సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీ పక్కనే ఉన్నారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాపై ఘన విజయం:
ఈ మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు తీశారు.