
మూడు వారాల పాటు టోర్నీకి ధావన్ దూరం
దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిని ఎంపిక చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డాడు.

భజ్జీ మాట్లాడుతూ
భజ్జీ మాట్లాడుతూ "నాకు తెలియదు, రోహిత్ శర్మ ఎంత బాధపడుతున్నాడో.. తుది జట్టులో ధావన్ లేకపోవడం ఓపెనర్ రోహిత్ శర్మపై ఒత్తిడిని పెంచుతుంది. కేఎల్ రాహుల్తో అతడి భాగస్వామ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ధావన్ వంటి కీలక ఆటగాడు జట్టుకు దూరం కావడం భారత్కు కచ్చితంగా ప్రతికూల పరిస్థితే" అని అన్నాడు.

సగం టోర్నమెంట్ పూర్తి అవుతుంది
"అందులోనూ మూడు వారాలు అంటే దాదాపు సగం టోర్నమెంట్ పూర్తి అవుతుంది. ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నా అతను ఇటీవల ఓపెనింగ్కు దిగిన సందర్భాలు లేవని.. ధావన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎంపిక చేయడం జట్టు మేనేజ్మెంట్కు సవాల్తో కూడుకున్న పని" అని హర్భజన్ తెలిపాడు.

రిషబ్ పంత్ లేదా అజ్యింకె రహానే
ప్రస్తుతం ధావన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల విషయానికి వస్తే రిషబ్ పంత్ లేదా అజ్యింకె రహానే ముందు వరుసలో ఉంటారు. ఇంగ్లాండ్ పిచ్లపై రహానేకు మెరుగైన రికార్డు ఉంది. గత వరల్డ్కప్లోనూ రహానే మిడిలార్డర్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడని భజ్జీ తెలిపాడు.

ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై ప్రభావం
రిషబ్ పంత్కు మాత్రం తాను తొలి ప్రాధాన్యతనిస్తానని, అయితే, అనుభవం విషయానికొస్తే మాత్రం రహానేను ఎంపిక చేస్తానని భజ్జీ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్లతో తలపడనుంది. ఆ మ్యాచ్తో ఓపెనింగ్, నాలుగో స్థానంపై కూడా స్పష్టత రానుంది. ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై పడనుంది.


Click it and Unblock the Notifications












