
ధోని కెప్టెన్ కాకపోవచ్చు
వరల్డ్కప్ నేపథ్యంలో సురేశ్ రైనా మాట్లాడుతూ "పేపర్పై ధోని కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, మైదానంలో కోహ్లీసేనకు ధోనినే కెప్టెన్" అని సురేశ్ రైనా పీటీఐకి ఇచ్చిని ఇంటర్యూలో తెలిపాడు. ప్రస్తుతం సురేశ్ రైనా తన కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆత్మవిశ్వాసంతో కోహ్లీ
"ధోని రోల్ ఇప్పటికీ అదే. స్టంప్స్ వెనుక నుంచి బౌలర్లతో మాట్లాడి ఫీల్డింగ్ను సెట్ చేస్తాడు. కెప్టెన్లకే కెప్టెన్. స్టంప్స్ వెనుక ధోని ఉంటే విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆ విషయం కోహ్లీకి తెలుసు" అని రైనా తెలిపాడు. ఐపీఎల్లో 10 సీజన్ల పాటు ధోని నాయకత్వంలో రైనా ఆడిన సంగతి తెలిసిందే.

హార్ధిక్ పాండ్యా కీలకం
ఇంగ్లాండ్ వరల్డ్కప్లో పాండ్యా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని రైనా తెలిపాడు. పాండ్యా గురించి రైనా మాట్లాడుతూ "ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయగలడు. దీంతో పాటు 6-7 ఓవర్లు వేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు స్వేచ్చగా ఆడేందుకు జట్టు మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ నివ్వాలి. ఐపీఎల్ ఆత్మవిశ్వాసాన్ని వరల్డ్కప్లో ప్రదర్శిస్తే అతడే గేమ్ ఛేంజర్ కాగలడు" అని రైనా అన్నాడు.

కోహ్లీకి ఇది అతిపెద్ద వరల్డ్కప్
విరాట్ కోహ్లీకి ఇది అతిపెద్ద వరల్డ్కప్ అని రైనా అన్నాడు. "కెప్టెన్, టీమ్ ప్లేయర్గా కోహ్లీ అద్భుతం. అతడికి ఇది అతిపెద్ద వరల్డ్కప్. ఈ మెగా టోర్నీలో అతడి పాత్ర ఏంటో తెలుసు. జట్టులోని సహచర ఆటగాళ్లకు ఆతడు ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. టోర్నీలో టీమిండియా ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదే అత్యుత్తమ జట్టు" అని రైనా అన్నాడు.


Click it and Unblock the Notifications
