
హైదరాబాద్: ఐసీసీ వరల్డ్కప్ టోర్నీలో భాగంగా సోమవారం ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగగా... పాక్ రెండు మార్పులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లాండ్ జట్టులో లియాం ప్లంకెట్ స్థానంలో మార్క్ వుడ్ చోటు దక్కించుకోగా... పాకిస్థాన్ జట్టులో ఇమాద్, హారిస్ స్థానంలో ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ ఆడిన తన తొలి మ్యాచ్లో విజయం సాధించగా.... వెస్టిండిస్తో జరిగిన తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్లో నెగ్గి తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలోని ఇంగ్లాండ్ భావిస్తోంది.
{headtohead_cricket_5_2}
జట్ల వివరాలు:
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా అర్చర్, అదిల్ రషీద్, మార్క్ ఉడ్
పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్(వికెట్ కీపర్/కెప్టెన్), మొహమ్మద్ హఫీజ్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, వాహబ్ రియాజ్, మొహ్మద్ ఆమిర్