వారిపై నిషేదం:
మ్యాచ్ జరుగుతుండగా రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. అంతేకాదు స్టేడియం వెలుపల ఉన్న ఆస్తులను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే ఇరు దేశాల క్రికెట్ అభిమానులను శాంతింపజేశారు. గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. ప్రపంచకప్మిగతా మ్యాచ్లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని ఐసీసీ స్పష్టం చేసింది.

ఆఫ్గనిస్థాన్ గెలిచే సమయంలో:
పాకిస్తాన్కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్ అభిమానులు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు సమాచారం తెలుస్తోంది. మ్యాచ్లో ఓ దశలో ఆఫ్గనిస్థాన్ గెలిచే అవకాశం ఉన్న సమయంలోనే ఈ గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సెమీస్ ఆశలు సజీవం:
టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 49.4 ఓవర్లలో లక్ష్యన్ని ఛేదించింది. ఓడిపోయే దశలో ఇమాద్ వసీమ్ (49 నాటౌట్; 54 బంతుల్లో 5×4) పోరాడడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు అఫ్గాన్ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications
