ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ను టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. మైదానంలో భారత్కు మద్దతుగా జాతీయ జెండాతో సందడి చేసింది. మంచు లక్ష్మిని చూసి అక్కడున్న భారత అభిమానులు కూడా హుషారుగా భారత్కు మద్దతు తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీనికి సంబంధించిన ఫోటోలోను మంచు లక్ష్మి అభిమానులతో పంచుకున్నారు. భారత్కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ మ్యాచులో టీమిండియా గెలవాలని ఆమె ఆకాంక్షించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో సందడి చేశాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి గ్రౌండ్లో సందడి చేశాడు. అంతేకాదు ఏకంగా అతను కామెంటర్ అవతారం ఎత్తాడు.
India bring up their 💯 without losing a wicket!#CWC19 | #INDvPAK pic.twitter.com/1wrWn6VKwW
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఘనంగా ఆరంభించారు. ఇద్దరు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 136 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ (78), రాహుల్ (57) పరుగులతో క్రీజులో ఉన్నారు.
{headtohead_cricket_3_5}