న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. మంచు లక్ష్మి సందడి

CWC 19, India vs Pakistan: Tollywood Actress Lakshmi Manchu appears in India-Pak match

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. మైదానంలో భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో సందడి చేసింది. మంచు లక్ష్మిని చూసి అక్కడున్న భారత అభిమానులు కూడా హుషారుగా భారత్‌కు మద్దతు తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీనికి సంబంధించిన ఫోటోలోను మంచు లక్ష్మి అభిమానులతో పంచుకున్నారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ మ్యాచులో టీమిండియా గెలవాలని ఆమె ఆకాంక్షించారు. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌ కూడా ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో సంద‌డి చేశాడు. టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో క‌లిసి గ్రౌండ్‌లో సంద‌డి చేశాడు. అంతేకాదు ఏకంగా అతను కామెంట‌ర్ అవ‌తారం ఎత్తాడు.

పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఘనంగా ఆరంభించారు. ఇద్దరు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 136 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ (78), రాహుల్ (57) పరుగులతో క్రీజులో ఉన్నారు.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 16:41 [IST]
Other articles published on Jun 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X