|
జట్టుగా విఫలమయ్యాం:
'కీలక సమయంలో జట్టుగా ఆడటంలో విఫలమయ్యాం. కేవలం 30 నిమిషాల పేలవ ఆటతీరు ప్రపంచకప్ అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ప్రస్తుతం నా హృదయం భారంగా ఉంది. నాలాగే మీరు కూడా బరువైన హృదయాలతో ఉన్నారని తెలుసు. ఇంగ్లాండ్ గడ్డపై భారత అభిమానుల స్పందన అమోఘం. భారత్ ఆడిన ప్రతీచోట ఇంగ్లాండ్ను నీలం రంగులో మార్చినందుకు అందరికీ ధన్యవాదాలు' అని రోహిత్ రాసుకొచ్చాడు. ఈ టోర్నీలో రోహిత్ (648) టాప్ స్కోరర్.
ఐదు సెంచరీలు:
ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసాడు. దీంతో రోహిత్ శర్మ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఒక ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు.
నాకౌట్లో ఒక పరుగు:
240 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయింది. 14 పరుగులకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు పెవిలియన్ చేరారు. దినేష్ కార్తీక్ (6) కూడా వెనుతిరగడంతో టీమిండియా గెలుపు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. పంత్ (32) , పాండ్యా (32 )కొద్దిసేపు క్రీజులో ఉన్నా.. అనవసర షాట్లు ఆడి ఔట్ అయ్యారు. అనంతరం రవీంద్ర జడేజా (77), ఎంఎస్ ధోనీ (50) పోరాడినా.. కీలక సమయంలో ఇద్దరూ ఔట్ అవ్వడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. అన్ని మ్యాచుల్లో చెలరేగిన రోహిత్.. కీలక నాకౌట్లో చేతులెత్తేశాడు.