|
దేశానికి క్షమాపణ చెప్పు:
మైదానంలో విజయ్ మాల్యాను చూసిన భారత అభిమానులు చోర్-చోర్ (దొంగ-దొంగ) అని అరిచారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ ఊహించని ఘటనతో మాల్యా కంగుతున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై విలేకరులు ప్రశ్నించిగా.. 'క్రికెట్ అంటే ఇష్టం. మైదానంకు మ్యాచ్ చూడ్డానికి వచ్చాను. జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నాను. దేశం బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నం' అని మాల్యా తెలిపాడు.
టీమిండియాకు అభినందనలు:
మ్యాచ్ అనంతరం విజయ్ మాల్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసాడు. 'ఆస్ట్రేలియాపై విజయం సాధించిన క్రికెట్ మ్యాచ్ను నా కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి మ్యాచ్ చూడటం సంతోషంగా ఉంది. విరాట్ కోహ్లీ, జట్టు సబ్యులకు అభినందనలు' అని మాల్యా ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాపై విజయం:
ఈ మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు తీశారు.