జాదవ్ స్థానంలో కార్తీక్:
అయితే మంగళవారం మ్యాచ్లో కేదార్ జాదవ్ స్థానంలో జడేజా కాకుండా.. స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ఆడాడు. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.