CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత శుక్రవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది.ఆర్సీబీ చేతిలో సీఎస్కే పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ఘన్ సంతతికి చెందిన క్రికెటర్ నూర్ అహ్మద్ మెరిశాడు. నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 36 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో నూర్ అహ్మద్ టోర్నమెంట్ లో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. నూర్ అహ్మద్ ఈ టోర్నమెంట్లో మొత్తం రెండు మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీతో ఆడే ముందు నూర్ అహ్మద్ ఖాతాలో నాలుగు వికెట్లు ఉన్నాయి. పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీపై నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 36 పరుగులకు మూడు విలువైన వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ తర్వాత ఆర్సీబీ బౌలర్ జోష్ హేజిల్వుడ్ మూడో స్థానంలో ఉన్నాడు. హేజిల్వుడ్ రెండు మ్యాచ్లలో 5 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానంలో సీఎస్కే ఆటగాడు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ రెండు మ్యాచ్ లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ 2025లో ఎనిమిదో మ్యాచ్ ఆర్సీబీ, సీఎస్కీ జట్ల మధ్య చెపాక్ మైదానంలో జరిగింది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ చెన్నైకి 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో సీఎస్కేను ఓడించింది. ఈ మైదానంలో ఆర్సీబీకి ఇది రెండో విజయం. సీఎస్కే తరఫున మహేంద్ర సింగ్ ధోని చివరి ఓవర్ లో రెండు అద్భుతమైన సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ధోని కొట్టిన ఈ కీలక ఇన్నింగ్స్ జట్టును గెలిపించడానికి సరిపోలేదు. మ్యాచ్ సీఎస్కేకు చాలా దూరం వెళ్లినప్పుడు ధోని క్రీజులోకి వచ్చాడు. ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేసి అభిమానులను అలరించాడు.