ధోనీ కొత్త రికార్డ్లు, వెక్కిరిస్తే ఎంజాయ్ చేశాను: కోహ్లీ
మీర్పూర్: భారత క్రికెట్ జట్టుకు ఎప్పుడూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన టీం ఎక్కడ ఆడినా అక్కడి భారత అభిమానులు మన జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంటారు. మీర్పూర్లోని షేర్ ఈ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అది జరగలేదు.
అభిమానులు కొంతమంది భారత్కు మద్దతి పలికినప్పటికీ... ఎక్కువగా మైదానంలో ఆకుపచ్చదనం (బంగ్లాదేశ్ అభిమానులు) కనిపించారు. బంగ్లా జట్టును వారు ఉత్సాహపరిచారు. అయినప్పటికీ భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి కప్ గెలుచుకుంది. ఈ కప్ గెలుపు ద్వారా ధోనీ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
తుది మ్యాచులో క్రీజులోకి వచ్చిన ధోనీ జూలు విదిల్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాటును ఝుళిపించిన ధోనీ ఆరు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. రెండు సిక్స్లు, ఓ ఫోర్ బాదిన ధోనీ... తానెదుర్కొన్న చివరి బంతిని సిక్స్గా మలిచి విన్నింగ్ షాట్ను గుర్తుండేలా కొట్టాడు.
తాజా విజయంతో ఆరుసార్లు టీమిండియా ఆసియా కప్ను గెలిస్తే, వాటిలో రెండుసార్లు ధోనీ సారథ్యంలోనే కప్ను చేజిక్కించుకుంది. నిన్నటి విజయంతో ధోనీ సరికొత్త రికార్డు కూడా నెలకొల్పాడు. ఐదు మేజర్ టోర్నమెంట్లలో తన జట్టును విజేతగా నిలిపిన విజయవంతమైన సారథిగా ధోనీ... ప్రపంచ క్రికెట్లో అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నాడు.
ఇప్పటిదాకా ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్, ఐసీసీ ప్రపంచ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఆసియా కప్ టీ20 కప్... ఇలా మొత్తం ఐదు మేజర్ టోర్నీల్లో సత్తా చాటిన ధోనీ తన జట్టును ఈ ఐదింటిలోనూ విజేతగా నిలిపాడు. భారత్కు తాజా ఆసియా కప్ ఆరవది. అత్యధికంగా కప్ గెలిచింది భారతే. శ్రీలంక ఐదుసార్లు ఆసియా కప్ గెలిచింది.
ఫైనల్ మ్యాచ్ జరిగిన మైదానం కెపాస్టీ 25వేలు. మ్యాచ్ సమయంలో.. బంగ్లాదేశ్ వికెట్లు పడిన సందర్భాల్లో, భారత బ్యాట్సుమెన్ బౌండరీలు కొట్టిన సందర్భాల్లో.. స్టేడియంలో సందడి లేదు. కేకలు లేవు. ఒకవిధంగా గుండు పిన్ను పడినా కూడా శబ్దం వచ్చేలా అభిమానులు మౌనం దాల్చారు. బంగ్లా వికెట్లు పడ్డప్పుడు, మనోళ్లు దంచి కొట్టినపప్పుడు బంగ్లా అభిమానులు తమ జట్టు కోసం ఆవేదనకు గురయ్యారు.
బంగ్లాలో భారత జట్టుకు ప్రోత్సాహం లభించక పోవడంపై మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ స్పందించాడు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ... బంగ్లా అభిమానులు మాకు లేదా నాకు వ్యతిరేకంగా ఉండటాన్ని మేం ఎంజాయ్ చేశామని చెప్పాడు. ప్రేక్షకులు తనను వెక్కిరించడం లేదా వ్యతిరేకించడం వల్ల నాలో ఉత్సాహం మరింత పెరిగిందన్నాడు.

విరాట్ కోహ్లీ, శిఖర్
ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు అంచనాలను అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.

ఫైనల్ మ్యాచ్
వర్షం వల్ల ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బుమ్రా (1/13), అశ్విన్ (1/14)ల పొదుపైన బౌలింగ్తో మొదట బంగ్లాదేశ్ను 120/5కు నియంత్రించారు.

ఫైనల్ మ్యాచ్
శిఖర్ ధావన్ (60), విరాట్ కోహ్లి (41 నాటౌట్), ధోని (20 నాటౌట్)ల కళ్లు చెదిరే బ్యాటింగ్తో 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఫైనల్ మ్యాచ్
టాప్ ఆర్డర్ చాలా వరకు పని పూర్తి చేసిందని, లోయర్ ఆర్డర్ అవసరానికి తగినట్లు ఆడిందని, ఇప్పుడు జట్టు బాగుందని, ప్రపంచకప్కు సిద్ధంగా ఉన్నామని ధోనీ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

ఫైనల్ మ్యాచ్
బుమ్రా బౌలింగ్లో అందమేంటంటే.. అతడు యార్కర్లు బాగా వేయగలడని, భిన్నమైన బౌలింగ్ శైలి కూడా ఉపయోగపడుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో యువరాజ్కు నాలుగో స్థానం ఇవ్వడం కష్టమని, కానీ అతడు సర్దుకున్నాడని, జట్టులో 13-14 మంది మ్యాచ్ విన్నర్లున్నారని, అదే మా జట్టు గొప్పతనం అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications