
విరాట్ కోహ్లీ, శిఖర్
ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు అంచనాలను అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.

ఫైనల్ మ్యాచ్
వర్షం వల్ల ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బుమ్రా (1/13), అశ్విన్ (1/14)ల పొదుపైన బౌలింగ్తో మొదట బంగ్లాదేశ్ను 120/5కు నియంత్రించారు.

ఫైనల్ మ్యాచ్
శిఖర్ ధావన్ (60), విరాట్ కోహ్లి (41 నాటౌట్), ధోని (20 నాటౌట్)ల కళ్లు చెదిరే బ్యాటింగ్తో 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఫైనల్ మ్యాచ్
టాప్ ఆర్డర్ చాలా వరకు పని పూర్తి చేసిందని, లోయర్ ఆర్డర్ అవసరానికి తగినట్లు ఆడిందని, ఇప్పుడు జట్టు బాగుందని, ప్రపంచకప్కు సిద్ధంగా ఉన్నామని ధోనీ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

ఫైనల్ మ్యాచ్
బుమ్రా బౌలింగ్లో అందమేంటంటే.. అతడు యార్కర్లు బాగా వేయగలడని, భిన్నమైన బౌలింగ్ శైలి కూడా ఉపయోగపడుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో యువరాజ్కు నాలుగో స్థానం ఇవ్వడం కష్టమని, కానీ అతడు సర్దుకున్నాడని, జట్టులో 13-14 మంది మ్యాచ్ విన్నర్లున్నారని, అదే మా జట్టు గొప్పతనం అన్నాడు.


Click it and Unblock the Notifications











