For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫస్ట్ టెస్టు ఫస్ట్ సెంచరీ క్రికెటర్ మృతి

అహ్మదాబాద్‌: టెస్టుల్లో ఆరంగ్రేట మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేసిన మొట్ట మొదటి భారత క్రికెటర్‌ దీపక్‌ శోధన్‌ మృతి చెందారు. 1952లో పాకిస్థాన్‌ తో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌ ద్వారా టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టారు శోధన్‌. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ ను తన శతకం ద్వారా గట్టెక్కించాడు శోధన్.

http://www.oneindia.com/sports/cricket/former-test-cricketer-deepak-shodhan-passes-away-2100094.html

తన ఇన్నింగ్స్ లో మొత్తం 15 ఫోర్లతో సెంచరీని నమోదు చేసిన శోధన్.. టెయిలెండర్‌ దత్తుతో కలిసి 86 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. దీంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసి భారత్ కు ఓటమి తప్పింది. 1953లో వెస్టిండీస్‌ భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ శోధన్ కు ఆఖరిది. ఎడమచేతి వాటం గల ఈ ఆల్ రౌండర్ దేశవాళీ క్రికెట్ లోను తనదైన మార్క్ వేశాడు. దేశవాళీల్లో బరోడా, గుజరాత్‌ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు శోధన్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+