ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ క్రికెటర్ను బ్యాట్స్మన్ స్టంప్లతో కొట్టి చంపాడు. వికెట్ కీపింగ్ చేస్తున్నబాబుల్ సిక్దర్ నో బాల్పై అంపైర్కు అప్పీల్ చేశాడు. ఆ రకంగా తనను రెచ్చగొట్టాడంటూ బ్యాట్స్మన్ అతడిని స్టంప్లతో మెడపై పొడిచాడు.
దీంతో సిక్దర్ అక్కడికక్కడే కూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయాడు. స్టంపులతో పొడిచి చంపిన బ్యాట్స్మన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సంఘటన బుధవారంనాడు చోటు చేసుకుంది.

బౌలర్ వేసిన బంతిని నో బాల్గా ప్రకటించడం ద్వారా అంపైర్ బ్యాట్స్మన్కు అనుకూలంగా వ్యవహరించడానేది సిక్దర్ భావనగా కనిపిస్తోందని అంటున్నారు. అంతకు ముందటి బంతిని కూడా అదే విధంగా అంపైర్ నో బాల్ ఇచ్చాడు. దాంతో సిక్దర్ ఆ అభిప్రాయానికి వచ్చాడు.
సిక్దర్ వ్వహారం బ్యాట్స్మన్కు కోపం తెప్పించిందని, దాంతో స్టంప్ సిక్దర్ తల వెనక భాగంలో కొట్టాడని, దాంతో అతను మైదానంలోనే పడిపోయాడని, ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడని పోలీసులు అధికారులు చెప్పారు.