తొలి సెమీఫైనల్లో ఇండియా Vs న్యూజిలాండ్
టోర్నీలో భాగంగా గత శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ను వీక్షించారు. ఇక, మంగళవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ని సైతం వీక్షించనున్నారు. కోహ్లీసేనకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సింగపూర్ నుంచి లండన్కు కారులో బయలుదేరినట్లు మాథుర్ ఫ్యామిలీ పేర్కొంది.
విమానంలో వెళితే గంటల్లోనే
విమానంలో వెళితే గంటల్లోనే లండన్కు చేరుకుంటామని.... అయితే, ప్రయాణం థ్రిల్ ఉండాలన్న ఉద్దేశంతో రోడ్డు రూట్ను ప్రిఫర్ చేసుకుని లండన్కు కారులో వెళ్లినట్లు మాథుర్ ఫ్యామిలీ పేర్కొంది. అనుపమ్ మాథుర్ తన తల్లి, తండ్రులతో పాటు భార్యాపిల్లల్ని లండన్కు కారులోనే తీసుకెళ్లడం విశేషం.
ఇదే తొలిసారి కాదు
అయితే, మాథుర్ ఫ్యామిలీ ఇలా విదేశాల్లో కారు ప్రయాణం చేయడం వీళ్లకు ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఇలానే వరల్డ్ టూర్కు వెళ్లారు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ సుమారు 96 వేల కిలోమీటర్లు తిరిగారు. టీమిండియా మ్యాచ్లను తిలకించేందుకు మాథుర్ ఫ్యామిలీ సింగపూర్, మలేషియా, థాయిల్యాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బకిస్తాన్, కజకస్తాన్ మీదుగా రష్యాకు చేరుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది
ఆ తర్వాత రష్యా నుంచి ఫిన్ల్యాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఇంగ్లండ్ చేరుకుంది. ఉజ్బకిస్తాన్, కిర్గిస్తాన్ దేశాల్లో ఉన్న ప్రకృతి సోయగాలను తనను ఆకట్టుకున్నట్లు అనుపమ్ చెప్పాడు. కొన్ని దేశాల్లో అయితే గైడ్ల సాయంతో పర్యటించామని... ఆర్కిటిక్ సర్కిల్లో ప్రయాణించడం సంతోషంగా ఉందని అనుపమ్ తెలిపాడు.