న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ మీద ఉన్న అభిమానం: కారులో సింగ‌పూర్ నుంచి లండ‌న్‌కు!

Cricket World Cup: India fans travel from Singapore to England

హైదరాబాద్: భారతీయులు క్రికెట్‌ను ఓ మతంలా అభిమానిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే క్రికెట్ వారికి పిచ్చి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా క్రికెట్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. సింగ‌పూర్‌లో ఉంటున్న మాథుర్ ఫ్యామిలీకి క్రికెట్ అంటే ఇష్టం. ఇంకేముంది.. ఇంగ్లాండ్‌ వేదికగా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను వీక్షించేందుకు గాను పెద్ద సాహ‌సాన్ని చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సింగ‌పూర్ నుంచి లండ‌న్‌కు మాథుర్ ఫ్యామిలీ కారులో ప్ర‌యాణించింది. సుమారు 22 వేల కిలోమీట‌ర్లు కారులో వెళ్లారు. వీళ్లంతా చెన్నైకు చెందిన వారే అయినప్పటికీ... గ‌త 14 ఏళ్లుగా సింగ‌పూర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఏడు సీట్ల టొయోటా వెల్‌ఫైర్ కారులో... మొత్తం 17 దేశాల మీదుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. ఇందుకోసం వారికి 46 రోజులు పట్టింది.

తొలి సెమీఫైనల్లో ఇండియా Vs న్యూజిలాండ్

తొలి సెమీఫైనల్లో ఇండియా Vs న్యూజిలాండ్

టోర్నీలో భాగంగా గ‌త శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌ను వీక్షించారు. ఇక, మంగళవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌ని సైతం వీక్షించనున్నారు. కోహ్లీసేనకు మద్దతు ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే సింగపూర్ నుంచి లండ‌న్‌కు కారులో బ‌య‌లుదేరిన‌ట్లు మాథుర్ ఫ్యామిలీ పేర్కొంది.

విమానంలో వెళితే గంట‌ల్లోనే

విమానంలో వెళితే గంట‌ల్లోనే

విమానంలో వెళితే గంట‌ల్లోనే లండన్‌కు చేరుకుంటామని.... అయితే, ప్రయాణం థ్రిల్ ఉండాల‌న్న ఉద్దేశంతో రోడ్డు రూట్‌ను ప్రిఫ‌ర్ చేసుకుని లండన్‌కు కారులో వెళ్లినట్లు మాథుర్ ఫ్యామిలీ పేర్కొంది. అనుప‌మ్ మాథుర్ త‌న త‌ల్లి, తండ్రుల‌తో పాటు భార్యాపిల్ల‌ల్ని లండన్‌కు కారులోనే తీసుకెళ్లడం విశేషం.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

అయితే, మాథుర్ ఫ్యామిలీ ఇలా విదేశాల్లో కారు ప్ర‌యాణం చేయ‌డం వీళ్ల‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఇలానే వరల్డ్ టూర్‌కు వెళ్లారు. ఇప్ప‌టికే ఈ ఫ్యామిలీ సుమారు 96 వేల కిలోమీట‌ర్లు తిరిగారు. టీమిండియా మ్యాచ్‌ల‌ను తిల‌కించేందుకు మాథుర్ ఫ్యామిలీ సింగ‌పూర్‌, మ‌లేషియా, థాయిల్యాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బ‌కిస్తాన్‌, క‌జ‌క‌స్తాన్‌ మీదుగా రష్యాకు చేరుకున్నారు.

చాలా సంతోషంగా ఉంది

చాలా సంతోషంగా ఉంది

ఆ తర్వాత ర‌ష్యా నుంచి ఫిన్‌ల్యాండ్‌, స్వీడ‌న్‌, డెన్మార్క్‌, జ‌ర్మ‌నీ, నెద‌ర్లాండ్స్‌, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఇంగ్లండ్ చేరుకుంది. ఉజ్బ‌కిస్తాన్‌, కిర్గిస్తాన్ దేశాల్లో ఉన్న ప్ర‌కృతి సోయ‌గాల‌ను త‌న‌ను ఆక‌ట్టుకున్న‌ట్లు అనుప‌మ్ చెప్పాడు. కొన్ని దేశాల్లో అయితే గైడ్ల సాయంతో పర్యటించామని... ఆర్కిటిక్ స‌ర్కిల్‌లో ప్ర‌యాణించ‌డం సంతోషంగా ఉంద‌ని అనుపమ్ తెలిపాడు.

Story first published: Tuesday, July 9, 2019, 14:07 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X