
ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు
టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలనే తపనతో ఇంగ్లాండ్
సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్లు ఎంతో కీలకం
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆదివారం జరిగే మ్యాచ్లో మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు' అని పాకిస్థాన్ అభిమానులను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. ఈ ట్వీట్కు పాకిస్థాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు.

పొరుగువారిని చాలా ప్రేమిస్తాం
'మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం కచ్చితంగా భారత్కే మద్దతిస్తాం' అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... 'భారత్, పాకిస్తాన్ రెండూ ఇంగ్లండ్కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి" అని మరోక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'నేను పాకిస్తానీని, కానీ నేను ఇండియాను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఎవరెన్ని చేసినా, పాకిస్తాన్ టీమ్ గెలవదని నాకు తెలుసు. భారత జట్టు మాకంటే చాలా ముందుంది" అని మరోక నెటిజన్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












