|
78 బంతుల్లో 113 పరుగులు చేసిన ధోని
ఈ క్రమంలో ధోని 78 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ధోని సిక్స్తో సెంచరీని అందుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు) కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది.
బౌలర్ను ఆపి మరీ
ఇదిలా ఉంటే, భారత జట్టు ఇన్నింగ్స్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బౌలర్ షబ్బీర్ రెహ్మాన్ 39వ ఓవర్ వేస్తున్న సమయంలో క్రీజులో ఉన్న ధోని బౌలర్ను ఆపి మరీ మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ను తీసేయాల్సిందిగా సూచించాడు. ధోని చెప్పిన విధంగానే ఆ బౌలర్ చేయడంతో తిరిగి ఆట ప్రారంభమైంది.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ధోని చెప్పిన సూచనను ప్రత్యర్ధి జట్టు బౌలర్ పాటించడంతో కామెంటేటర్లు సైతం అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ పట్ల ధోనికి ఉన్న నిబద్ధతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
|
95 పరుగుల తేడాతో భారత్ విజయం
కాగా, ఈ మ్యాచ్లో 360 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 95 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు చేజార్చుకోవడం విశేషం.