ఎలాంటి ప్రమాదం జరగలేదు
అయితే అదృష్టవశాత్తు ముగ్గురూ తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో తమీమ్ వెంటనే కుటుంబాన్ని తీసుకుని బాంగ్లాదేశ్ తిరుగుపయనమయ్యాడు. ఈ ఘటనపై తమీమ్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలుస్తోంది.
వ్యక్తిగత కారణాల వల్ల
ఈ మేరకు బంగ్లా వెబ్సైట్ డైలీ స్టార్ వెల్లడించింది. తమిమ్ భార్య ఆయేషా, వాళ్ల ఏడాది తనయుడిపై యాసిడ్ దాడి జరిగినట్లు ఆ వెబ్సైట్ తెలిపింది. మరోవైపు తమీమ్ ఒప్పందం కుదుర్చుకున్న ఎసెక్స్ కౌంటీ క్లబ్ కూడా వ్యక్తిగత కారణాల వల్ల తమిమ్ బంగ్లాదేశ్ వెళ్లిపోయాడని ఓ ప్రకటనలో తెలిపింది.
ఎనిమిది టీ20 మ్యాచుల్లో ఆడేందుకు ఒప్పందం
ఎనిమిది టీ20 మ్యాచుల్లో ఆడేందుకు తమిమ్ ఒప్పందం కుదుర్చుకున్నా.. అతను కేవలం ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయాడు. మరోవైపు తమీమ్ ఇక్బాల్ మాత్రం ఈ యాసిడ్ దాడి వార్తలను ఖండించాడు. తన కుటుంబంపై విద్వేష పూరిత దాడి జరగలేదని అతను చెప్పాడు.
ఫేస్బుక్ పేజీలో వివరణ
వ్యక్తిగత కారణాల వల్లే తాను స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు అతను తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు. ఇంగ్లండ్లో క్రికెట్ ఆడటాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని, ఎసెక్స్ క్లబ్ కూడా వ్యక్తిగత కారణాల వల్ల తాను వెళ్లిపోతున్నానని చెప్పడంతో ఏమీ అనలేదని చెప్పాడు.
ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించిన బంగ్లా బోర్డు
మరోవైపు బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తమీమ్ కుటుంబంపై యాసిడ్ దాడి జరిగినట్లు చెప్పడం విశేషం. అతను స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆ అధికారి తెలిపారు. బంగ్లా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గానీ, తమీమ్ అన్న నఫీజ్గానీ ఈ ఘటనపై స్పందించడానికి నిరాకరించారు.