న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో చిన్న పిల్లల మధ్య చిన్న గొడవ ఏడుగురి ప్రాణాలు తీసింది

Cricket Match in Pakistan Turns Deadly After Scuffle Between Two Groups Kills Seven

పెషావర్: పాకిస్థాన్‌లోని ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వా ప్రావిన్సులో ఘోరం జరిగింది. క్రికెట్‌ మ్యాచ్ ఆడుతున్న‌ స‌మ‌యంలో చెల‌రేగిన గొడ‌వ చివ‌ర‌కు ఏడుగురి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన పాక్ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వా ప్రావిన్సులోని అబోటాబాద్ జిల్లాలో ఓ ఖాళీ స్థలంలో కొందరు పిల్లలు కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు.

<strong>వరల్డ్ టీ20: 'మిథాలీని బెంచ్‌కి పరిమితం చేయడం బాధించింది'</strong>వరల్డ్ టీ20: 'మిథాలీని బెంచ్‌కి పరిమితం చేయడం బాధించింది'

ఈ సమయంలో ఇరుజట్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఓ పిల్లాడిని "కావాలనే ఔట్ ఇచ్చారు" అంటూ ఒక జట్టు, లేదంటూ మరొక జట్టు గొవడకు దిగాయి. ఈ గొడవ చిలికిచిలికి పెద్దగా మారి పిల్లలు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. దీంతో క్రికెట్ గొడవ కాస్తా తల్లిదండ్రుల దాకా వెళ్లింది.

ఈ గొడ‌వ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వ‌ర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. పోలీసుల ఎదుట కూడా గొడవకు దిగిన ఇరు వర్గాలను రాజీ చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల మాటలను పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే సమయంలోనే రెండు వ‌ర్గాల ప్రజలు ఆయుధాల‌తో రావడం విశేషం.

ఫిర్యాదు స‌మ‌ర్పిస్తున్న క్ర‌మంలో ఆ గ్యాంగ్‌ల మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ రాజుకున్న‌ది. దీంతో రెండు వ‌ర్గాలు కాల్పులు జ‌రుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వ‌ర్గానికి చెందిన ముగ్గురు, మ‌రో వ‌ర్గానికి చెందిన న‌లుగురు మృతిచెందారు. కాల్పుల్లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు.

Story first published: Saturday, November 24, 2018, 13:59 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X