హైదరాబాద్: గత కొన్నాళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తమ దేశ క్రికెట్ బోర్డుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ను గ్యాంబ్లింగ్తో పోల్చారు.
సంక్లిష్టం: వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించలేక పోయిన శ్రీలంక
తమ దేశ క్రికెట్ బోర్డు నిర్వహరణ అద్వాన్నంగా ఉందని, క్రికెట్ను గ్యాంబ్లర్లు నడిపిస్తున్నారని, ఇప్పుడు క్రికెట్ ఓ గ్యాంబ్లింగ్ ఆటగా మారిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి సందర్భంలో ఆటగాళ్లపై ఎటువంటి ఆరోపణలు చేయలేమని అన్నారు.
ప్రస్తతం తమ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న సంక్షోభంపై తాను సంతృప్తిగా లేనని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభం ఉన్న ఒక్క ప్లేయర్ కూడా తమ క్రికెట్ బోర్డులో లేరని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పాలకుల అనేక మందిని పక్కనపెట్టడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు.
ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో వైట్ వాష్కు గురైన శ్రీలంక... ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో దారణంగా ఓటమి పాలైంది. ఇప్పటికే 4-0 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగే వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించలేక పోయింది.