ముంబై: వరుస వైఫల్యాలతో కుంగిపోతున్న టీమిండియా అభిమానులకు బుమ్రా కోలుకున్నాడని వచ్చిన వార్త సంతోషాన్ని కలుగజేసింది. ఇప్పటికే రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓడిపోవడంతో కచ్చితంగా గెలవాల్సిన మూడో టెస్టులో ఆడతాడని అనుకున్నారంతా.. కానీ, వారికి కలలు కల్లలుగా మారిపోయాయి. తాజాగా తెలిసిన సమాచారాన్ని బట్టి భువనేశ్వర్ మాత్రం మొత్తం ఇంగ్లాండ్ సిరీస్కే దూరంకానున్నట్లు తెలిసింది.
కోహ్లీలాగే వెన్నునొప్పి గాయంతో బాధపడుతోన్న భువనేశ్వర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదట. దీంతో అతడు ఇంగ్లాండ్తో పూర్తి టెస్టు సిరీస్కు దూరం కానున్నాడట. ఆతిథ్య ఇంగ్లాండ్తో రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్ మూడో వన్డేలో ఆడాడు. కానీ, అప్పటికీ భువి వెన్ను నొప్పి బాధించడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకోవాలని తెలుపుతూ అక్కడికి పంపారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు బీసీసీఐ మొదటి మూడు టెస్టు మ్యాచ్లకు జట్టును ప్రకటించింది.
చివరి రెండు టెస్టులకు భువనేశ్వర్ అందుబాటులో ఉంటాడని అప్పుడు తెలిపింది. కానీ, మూడో టెస్టుకు పాల్గొనేందుకు భువి ఇంకా సిద్ధంగా లేడట. పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టులకు భువి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో బీసీసీఐ ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టుల్లో ఆడే భారత జట్టును ప్రకటించనుంది. ఇందుకోసం భువిని సంప్రదించగా.. ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య శనివారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ ఓటమి పాలైంది. సిరీస్లో నిలవాలంటే భారత్ మూడో టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అయిపోతుంది. నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా శనివారం నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెన్నునొప్పి నుంచి కోలుకున్న కోహ్లీ.. మిగిలిన టీమిండియా క్రికెటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.