
ఆధారాలు లభించలేదు
అయితే, తమ విచారణలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇంతటితో ఈ విచారణను ఆపేస్తున్నామని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా' అని సంబోధించాడని అలీ తన ఆత్మకథలో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అది నా తొలి యాషెస్ టెస్టు
"అది నా తొలి యాషెస్ టెస్టు. నా ప్రతిభ బయటపెట్టేందుకు ఉపయోగపడేది. కానీ, అక్కడ జరిగిన ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు నన్ను ‘ఒసామా' అంటూ పిలిచేవాడు. అయితే మైదానంలో నేనెప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు" అని అలీ తెలిపాడు.

ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా
"ఆ ఆటగాడు చేసిన వ్యాఖ్యల గురించి ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా. ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ బేలిస్ ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ డారెన్ లీమన్తో సైతం ప్రస్తావించాడు. అప్పుడు కోచ్ డారెన్ ఆ ఆటగాడిని పిలిచి ‘మొయిన్ అలీని ఒసామా' అని పిలిచావా? అని ప్రశ్నించాడు. కానీ, ఆ ఆటగాడు ‘నేను అలా పిలవలేదు. కేవలం ‘పార్ట్టైమర్' అని మాత్రమే అన్నా' అంటూ అబద్ధం చెప్పాడు" అని అలీ పేర్కొన్నాడు.

తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్తో
దీంతో ఆ మ్యాచ్ మొత్తంలో తాను కోపంగానే ఉండాల్సి వచ్చిందని అన్నాడు. దీంతో ‘ఒసామా', ‘పార్ట్ టైమర్' అన్న పదాలకు తనకు తేడా తెలుసని, మరీ అంత పిచ్చివాడిని కాదని అలీ అప్పట్లో తాను చెప్పినట్లు వెల్లడించాడు. అంతేకాదు తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్తో తెలిపాడు. తాజాగా దీనిపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు.

విచారణ చేపట్టిన జట్టు మేనేజ్మెంట్
"ఈ ఘటన సమయంలోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సూచనల మేరకు మా జట్టు మేనేజ్మెంట్ విచారణ చేపట్టింది. అప్పుడే మొయిన్ అలీకి తమ స్పందనను కూడా తెలియజేయడం జరిగింది. అతడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం" అని సీఏ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications













