పోర్ట్ఆఫ్స్పెయిన్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి 9 రోజుల ముందుగానే సీపీఎల్ ముగియనుంది.
సీపీఎల్లో ఆడేందుకు ట్రినిడాడ్ మరియు టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు, నిర్వాహకులతో కూడిన మొత్తం 162 మందికి కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయిందని సీపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వీరంతా అక్కడి హోటల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఈ సమయంలో వీరందరికి రెగ్యులర్గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. సీపీఎల్లో పాల్గొనడానికి ఆటగాళ్లు అందరూ ఆగస్టు 1నే ట్రినిడాడ్ మరియు టొబాగోకు చేరుకున్న విషయం తెలిసిందే.
'సీపీఎల్లో పాల్గొనే మొత్తం 162 మందికి కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయింది. వారంతా అధికారిక హోటల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఈ సమయంలో వీరందరికి రెగ్యులర్గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్గా తేలితే వారిని హోటల్ నుంచి ఖాళీ చేయించి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రొటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్లో ఉంచుతాం. ప్రస్తుతానికైతే ట్రినిడాడ్కు వచ్చిన వారందరికి కరోనా నెగెటివ్ వచ్చింది' అని సీపీఎల్ యాజమాన్యం తెలిపింది.
BREAKING: CPL travelling party tests negative for COVID-19. Read more: https://t.co/MxPy5CjlRe #CPL20 pic.twitter.com/M6WnUNqyt4
— CPL T20 (@CPL) August 6, 2020
వెస్టిండీస్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్ సీపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. సీపీఎల్లో పాల్గొనేందుకు అలెన్ జమైకా నుంచి బార్బడోస్ వెళ్లాల్సి ఉంది. గత సోమవారం అతను సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోవడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. దీంతో టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సీపీఎల్ 2020 సీజన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున ఆడాల్సి ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో లాక్డౌన్ నిబంధనల ప్రకారం చార్టర్ విమానాలలో తప్ప ఎవరు దేశంలోకి ప్రవేశించడం లేదా నిష్క్రమించడానికి అనుమతి లేదు. దీంతో ఫాబియన్ ఇక టోర్నమెంట్లో పాల్గొనలేడు.
'హర్భజన్ నన్ను ఔట్ చేసినప్పుడల్లా.. ఫీల్డర్లు ఓ మాట అంటుండేవారు'