
అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్పై త్రివర్ణం వద్దు'
భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచడం ద్వారా జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త పి ఉల్హాస్ మొహాలీ పోలీస్ స్టేషన్లో చేశారు. భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణాన్ని ఉంచే చర్యను ఆయన తప్పుబట్టారు.

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్పై త్రివర్ణం వద్దు'
త్రివర్ణం ఉన్న హెల్మెట్లను ఫీల్డర్లు తాము ఉపయోగించని సమయాల్లో మైదానంలోనే ఉంచుతారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మైదానాల్లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఆటగాళ్లు అక్కడే ఉమ్ముతుంటారని కూడా అందులో పేర్కొన్నారు.

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్పై త్రివర్ణం వద్దు'
ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా భారత్-వెస్టిండిస్ల జట్ల మధ్య ఈనెల 31న జరిగే మ్యాచ్లో హెల్మెట్లపై త్రివర్ణాన్ని ధరించకుండా చూడాలని కోరారు. టీమిండియా కెప్టెన్ ధోని హెల్మెట్పై త్రివర్ణాన్ని ఉంచడం మానుకున్నప్పటికీ, కొందరు ఆటగాళ్లు మాత్రం ఇంకా వినియోగిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్పై త్రివర్ణం వద్దు'
అయితే క్రీడలకు సంబంధించిన విషయాలపై ఉల్లాస్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పుగా పాడారంటూ అమితాబ్ బచ్చన్పై ఫిర్యాదు చేసింది కూడా ఇతనే.


Click it and Unblock the Notifications











