చేజారిన రెండు పతకాలు
జూడో విభాగంలో భారత్కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. కాంస్య పతక మ్యాచ్లో మెన్స్ 66కేజీల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ కట్జ్ చేతిలో జస్లీన్ సింగ్ సైనీ ఓడిపోయాడు. అలాగే వుమెన్స్ 57కిలోల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓడింది.
వెయిట్ లిఫ్టింగ్లో మరో పతకం
4వ రోజు మహిళల 71కేజీల వెయిట్లిఫ్టింగ్లో భారత వెయిట్లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా భారత పతకాల సంఖ్య నాలుగో రోజు ముగిసేసరికి తొమ్మిదికి చేరుకుంది. ఆమె మొత్తం 212కిలోల బరువు ఎత్తింది. ఈ ఈవెంట్లో ఇంగ్లాండ్కు చెందిన సారా డేవిస్ 229 కేజీల బరువుతో స్వర్ణం సాధించగా.. కెనడాకు చెందిన యువ అలెక్సిస్ అష్వర్త్ మొత్తం 214కేజీల బరువుతో రజతం గెలుచుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్
భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో 3-0తో సింగపూర్ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. నేడు ఫైనల్లో మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-11, 21-12తో, పీవీ సింధు 21-11, 21-12తో, లక్ష్య సేన్ 21-18, 21-15తో గెలుపొంది భారత్ను ఫైనల్కు చేర్చారు. పురుషుల హాకీలో పూల్ 'బి' లీగ్ మ్యాచ్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా అయింది. పురుషుల స్క్వాష్ సింగిల్స్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు.

ఇప్పటివరకు భారత్ తరఫున పతకాలు సాధించింది వీరే
వెయిట్ లిఫ్టింగ్
1. మీరాబాయ్ చాను 49కేజీల విభాగంలో గోల్డ్,
2. జెరెమీ లాల్రినుంగా 67కేజీల విభాగంలో గోల్డ్,
3.అచింత షెవులి 73 కేజీల విభాగంలో గోల్డ్,
4. సంకేత్ మహదేవ్ 55 కేజీల విభాగంలో సిల్వర్,
5. బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో సిల్వర్,
6. గురురాజ్ పూజారి 61కేజీల విభాగంలో బ్రాంజ్
7.హర్జిందర్ కౌర్ 71కేజీల విభాగంలో బ్రాంజ్
జూడో
8.సుశీలా దేవీ 49కేజీల విభాగంలో గోల్డ్
9.విజయ్ కుమార్ 60కిలోల విభాగంలో బ్రాంజ్
లాన్స్ బౌల్స్
10. మహిళల ఫోర్స్ లాన్స్ బౌల్స్ టీం సిల్వర్ లేదా గోల్డ్ మెడల్


Click it and Unblock the Notifications












