హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్లో జరిగే వన్డే వరల్డ్ కప్కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ విషయంలో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ను ఉదాహరణగా తీసుకోవాలని గంభీర్ సూచించాడు.
1st ODI: విలియమ్సన్ హాఫ్ సెంచరీ, చాహల్ దెబ్బకు కివీస్ కుదేలు
ప్రస్తుతం భారత్ తరుపున చైనామన్ స్పిన్నర్లు బాగా ఆడుతున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ అనుభవం ఇంగ్లాండ్లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గంభీర్ అన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ "గతేడాది చైనామన్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఇప్పటికీ అశ్విన్ను పరిగణనలోకి తీసుకోవాలి" అని గంభీర్ అన్నాడు.
"మణికట్టు స్పిన్నరా ఫింగర్ స్పిన్నరా అని కాకుండా నాణ్యమైన స్పిన్నర్ ఎవరన్నది కీలకం. టెస్టు క్రికెట్లో రాణించిన నాథన్ లియాన్ను ఆస్ట్రేలియా వన్డేలకు ఎంపిక చేసింది. ఇంగ్లాండ్లో అశ్విన్కు అనుభవం ఉంది. అక్కడి ఫ్లాట్ పిచ్లకు అతడు సరిపోతాడు" అని గంభీర్ పేర్కొన్నాడు.
"టెస్టు క్రికెట్కు దూరమైన ఆటగాళ్లు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడితే బాగుంటుంది. అంబటి రాయుడు, ధోనీ, శిఖర్ ధావన్ రంజీలు ఆడితే మంచిది" అని గంభీర్ అన్నాడు. చైనామన్ స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ జోడీ వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో 2017 జులై నుంచి అశ్విన్ వన్డే జట్టుకు దూరమయ్యాడు.