|
ప్రతీ సిక్స్కు 250 డాలర్లు:
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు క్రిస్ లిన్ ఆడుతున్నాడు. బ్రిస్బేన్ జట్టుకు కెప్టెన్ కూడా. ఈ లీగ్ ద్వారా మంటల బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు లిన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. లీగ్లో కొట్టే ప్రతీ సిక్స్ను బాధితులకు డొనేట్ చేస్తానని ప్రకటించాడు. 'హే గయ్స్. ఈ ఏడాది బిగ్బాష్ లీగ్లో నేను కొట్టే ప్రతీ సిక్స్కు 250 డాలర్లను బాధితులకు సాయంగా అందిస్తా. అథ్లెట్లు, వివిధ క్రీడల నుండి చాలా మంది భాదితులను ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది' అని లిన్ ట్వీట్ చేశాడు.
మ్యాక్స్వెల్, షార్ట్ ఫిదా:
క్రిస్ లిన్ ట్వీట్కు ఫిదా అయిన ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, షార్ట్ కూడా భాదితులను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. వారు కూడా లీగ్లో కొట్టే ప్రతీ సిక్స్కు 250 డాలర్లను ఇవ్వనున్నారు. 'లవ్ ఇట్ లిన్నీ !!. ఈ బీబీఎల్లో నేను కొట్టిన సిక్స్కు 250 డాలర్లు ఇస్తాను. చాలా మందికి ఈ సాయం ఉపయోగపడుతుంది' అని మ్యాక్స్వెల్ ట్వీట్ చేశాడు.
టెన్నిస్ స్టార్లు కూడా:
ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా తన వంతు సాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఏటీపీ కప్లో తాను కొట్టే ప్రతీ ఏస్కు 200 డాలర్లను ఇస్తానని తెలిపాడు. మరొక టెన్నిస్ ప్లేయర్ అలెక్స్ డి మినార్ కూడా ప్రతీ ఏస్కు 250 డాలర్లు ఇస్తానని ప్రకటించాడు.
35 బంతుల్లో 94 పరుగులు:
లీగ్లో భాగంగా బ్రిస్బెన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటంగ్ చేసిన బ్రిస్బెన్ రెండో ఓవర్లో 6 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో క్రిస్ లిన్ బ్యాటింగ్కు వచ్చాడు. వచ్చిరావడంతోనే సిడ్నీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో 94 (4 ఫోర్లు, 11 సిక్సర్లు) పరుగులు చేసాడు. లిన్ ఇన్నింగ్స్లో ఏకంగా 11 సిక్సర్లు ఉండడం విశేషం.
వేలంలో కనీస ధరకే:
గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఆటగాళ్ల వేలంలో లిన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. లిన్ను కోల్కతా నైట్రైడర్స్ వదిలేసుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు లిన్.