హైదరాబాద్: కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు, క్రిస్ లిన్ అభిమానులకు కలిపి ఓ శుభవార్తను క్రిస్ లిన్ మేనేజర్ వెల్లడించారు. త్వరలో జరగనున్న ఐపీఎల్ లీగ్లో నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉంచేందుకు క్రిస్ లిన్ను పరిశీలిస్తున్న తరుణంలో గాయం కారణంగా అతను విరామం తీసుకోనున్నాడని, లీగ్కు అందుబాటులో ఉండబోడని వార్తలు వచ్చాయి. అయితే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసర్లేదంటూ తేల్చి చెప్పారు.
'నైట్ క్లబ్'లో గంగూలీ: కోల్కతా కెప్టెన్ ఎవరో ఆదివారం చెప్తాడు
దీంతో అతను ఐపీఎల్ కు అందుబాటులోకి రావచ్చంటూ అతని మేనేజర్ శుక్రవారం మీడియా మిత్రులకు వెల్లడించారు. ఇప్పటికే క్రిస్ లిన్ పాకిస్థాన్ సూపర్ లీగ్కు హాజరవలేకపోతున్నందుకు బాధ పడుతున్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరలో కోలుకుంటాడని, ఐపీఎల్ జరిగే నాటికి పూర్తి సన్నద్దతతో కనిపిస్తాడని ఆయన వెల్లడించాడు.
నైట్ రైడర్స్ ఆటగాడికి గాయం, లీగ్ పాల్గొంటాడనేది...?
ఈడెన్ పార్క్ వేదికగా బుధవారం జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బౌండరీకి వెళ్లబోయే బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ లిన్ ప్రయత్నించాడు. అతని కుడి భుజానికి కొద్ది రోజుల ముందే శస్త్ర చికిత్స జరగడంతో దానిని కాపాడుకుంటూనే బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. కొద్దిగా పట్టు సడలి ముందుకు పడటంతో అతని భుజానికి గాయమైంది. అక్కడే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఎముక పక్కకు జరిగిందని చెప్పారు. శస్త్ర చికిత్స చేయాల్సిందేనని చెప్పడంతో అలాగే మైదానం నుంచి వెనుదిరిగాడు.
రిటెన్షన్ జాబితాలోనే కాకుండా, వేలంలోనూ గౌతం గంభీర్ను జట్టులోకి తీసుకోకపోవడంతో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు కొత్త కెప్టెన్ కోసం వెంపర్లాట మొదలెట్టింది. ఈ క్రమంలోనే క్రిస్ లిన్ను తీసుకోవాలని యోచిస్తోంది. ఆదివారం రాత్రి స్టార్ ఛానల్లో ప్రసారం కాబోతున్న నైట్ క్లబ్ కార్యక్రమంలో గంగూలీ నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ను నిర్ధారించనున్నారు. గంగూలీ కూడా 2009వరకు నైట్ రైడర్స్ జట్టులో క్రీడాకారుడన్న సంగతి విదితమే.