
ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై కోర్టు ఆగ్రహం
దీనిపై విచారణ జరిపిన ఎన్ఎస్డబ్ల్యూ సుప్రీంకోర్టు ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఫెయిర్ ఫాక్స్ మీడియా క్రిస్ గేల్... మహిళా మసాజ్ థెరిపిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే దానికి ఆధారాలను కూడా చూపెట్టలేకపోయింది.
‘పాఠకులను ఆకట్టుకునే విధంగా వార్తలు రాస్తున్నారే తప్ప, అందులో ఎంతవరకు నిజం ఉన్నదో అనే దానిపై దృష్టి పెట్టడం లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల ఇలా ఎలా రాస్తారు' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తీర్పు పట్ల క్రిస్ గేల్ సంతోషం
అయితే, కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడం పట్ల క్రిస్ గేల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నేను మంచి వ్యక్తిని. సిగ్గుగా ఏమీ ఫీలవ్వడం లేదు. చాలా సంతోషంగా ఉన్నా' అని కాస్తంత ఎమోషనల్గా మాట్లాడాడు. ఈ కేసు విచారణలో జట్టు సహచర ఆటగాడు డ్వేన్ స్మిత్ సైతం కోర్టు విచారణలో క్రిస్ గేల్కు అండగా నిలిచాడు.

ఆ రోజు రూమ్లో ఏం జరిగిందో చెప్పిన మహిళా మసాజ్ థెరపిస్ట్
మరోవైపు ఈ కేసు విచారణకు హాజరైన మహిళా మసాజ్ థెరపిస్ట్ ఆ రోజు ఛేంజింగ్ రూమ్లో ఏం జరిగిందో వివరించింది. 'టవల్ కోసం నేను డ్రెస్ చేంజింగ్ రూమ్కు వెళ్లాను. టవల్ కట్టుకొని ఉన్న గేల్ ఎదురుపడ్డాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్ అని నేను చెప్పాను' అని ఆమె తెలిపింది.

కన్నీరుమున్నీరుగా ఏడ్చిన మసాజ్ థెరపిస్ట్
'వెంటనే క్రిస్ గేల్ తన టవల్ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా నా ముందు నుంచున్నాడు. ఈ సమయంలో క్రిస్ గేల్ మర్మాంగాన్ని కూడా చూశాను. వెంటనే చూపు తిప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వెంటనే వెస్టిండీస్ జట్టు ఫిజియోథెరపిస్ట్కు జరిగింది చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చేశాను' అని ఆమె కోర్టులో వివరించింది.


Click it and Unblock the Notifications