
హైదరాబాద్: చాన్నాళ్ల తర్వాత వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ తనదైన శైలిలో పరుగులు బాదాడు. బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్ (బీపీఎల్)లో రంగ్పూర్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న గేల్.. ఢాకాలో జరుగుతున్న బీపీఎల్లో కేవలం బౌండరీలతోనే గేల్ 108 పరుగులు చేయడం గమనార్హం.
శుక్రవారం ఖుల్నా టైటాన్స్పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేసిన గేల్ 51 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గేల్ ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్సర్లుండటం విశేషం. అంతకుముందు ఉన్న తన 12సిక్సర్ల రికార్డును తనే దాటేశాడు. ఈ మ్యాచ్లో 14 సిక్లర్లతో పాటు 6 ఫోర్లు కూడా కొట్టాడు.
ముందుగా టాస్ గెలుచుకున్న రంగ్పూర్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఖుల్నా టైటాన్స్ 6 వికెట్లు కోల్పోయి 167పరుగులు చేసింది. గేల్ జట్టు 168 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గేల్ టీ 20 మ్యాచ్ల్లో 800 సిక్సర్లు కొట్టిన రికార్డు సొంతం చేసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.