హైదరాబాద్: కింగ్ స్టన్ వేదికగా ఆదివారం వెస్టిండిస్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో కోహ్లీ సేన 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్తో టీమిండియా వెస్టిండిస్ పర్యటన ముగిసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు గాను కోహ్లీసేన వెస్టిండిస్ బయల్దేరిన సంగతి తెలిసిందే.
ఐదు వన్డేల సిరిస్ను 3-1తో సొంతం చేసుకున్న టీమిండియా ఏకైక టీ20లో మాత్రం ఓటమి పాలైంది. ఆదివారం ఏకైక టీ20 జమైకాలోని కింగ్ స్టన్లో జరిగింది. జమైకా వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ స్వస్థలం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఏకైక టీ20 ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లకు క్రిస్ గేల్ తన ఇంట్లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.
మ్యాచ్ అనంతరం టీమిండియాతో పాటు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా క్రిస్ గేల్ ఇంటికి వెళ్లి సరదాగా గడిపారు. అనంతరం గేల్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహానే... గేల్తో కలిసి దిగిన ఫొటోను తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చాలా మంది వెస్టిండిస్ ఆటగాళ్లు ఆడుతున్న నేపథ్యంలో భారత ఆటగాళ్లతో స్నేహపూరిత వాతావరణం నెలకొంది. వెస్టిండిస్ ఆటగాళ్లలో క్రిస్ గేల్తో పాటు డ్వేన్ బ్రావో సోదరులు ఐపీఎల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలో డ్వేన్ బ్రావో టీమిండియా ఆటగాళ్లకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్ సిరిస్ ముగిసిన నేపథ్యంలో జులై 26 నుంచి కోహ్లీసేన లంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడనుంది.
ఈ సిరిస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును జాతీయ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు.
లంక పర్యటనకు భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర పుజారా, అజింక్య రహానె (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్కుమార్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్.