Cheteshwar Pujara: ఐపీఎల్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులు ఈ టెస్ట్ సిరీస్పై దృష్టి సారించారు. మరోవైపు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, ఇతరులు టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు ఎప్పుడూ టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ సారి చరిత్ర సృష్టిస్తుందనే ఆశ ఉంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్నానని భారత టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు. అంతే కాకుండా భారత జట్టు తరఫున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పుజారా కూడా అకస్మాత్తుగా తొలగించడం పట్ల విచారం వ్యక్తం చేశాడు.
మౌనం వీడిన పుజారా..
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున 100కి పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడిన పుజారా ఇప్పుడు జట్టులో భాగంగా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పుజారా మాట్లాడుతూ.. భారత జట్టు తరఫున మళ్లీ ఆడటానికి కృషి చేస్తున్నానని అన్నాడు. భారత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడం నిరాశపరిచిందన్నాడు. భారత జట్టుకు తన అవసరం ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 103 టెస్టుల్లో 7195 పరుగులు చేసిన ఛతేశ్వర్ పుజారా.. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో తన చివరి టెస్ట్ ఆడాడు.

జట్టుకు తాను అవసరమైతే అవకాశం వస్తే తన వైపు నుంచి సిద్ధంగా ఉన్నానన్నారు. ఫిట్నెస్ పెంచుకున్నానని.. జాతీయ, దేశీయ క్రికెట్ లో బాగా రాణించానన్నారు. భారత జట్టు బలమైన జట్టు కానీ 20 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ లో సిరీస్ గెలవలేదు. అవకాశం వస్తే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఇంగ్లాండ్లో విజయం చాలా అవసరమైనప్పుడు జట్టుకు తోడ్పడటానికి ఇది ఒక గొప్ప అవకాశం అవుతుందన్నాడు.
కానీ క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ కారణంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పుజారా చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ క్రికెట్తో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నానన్నాడు. పెద్ద అవకాశాలను ఆశించకుండా ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు. స్థానిక క్రికెట్లో లేదా కౌంటీ క్రికెట్లో నాకు అవకాశం రాకపోయినా, అది సమస్య కాదన్నాడు. భారత జట్టులో అవకాశం లభిస్తే చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఆడనుంది.