
హైదరాబాద్: రాజ్కోట్ వేదికగా ఉత్తర ప్రదేశ్తో జరిగిన రంజీ మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాడు ఛటేశ్వర్ పుజారా మాయ చేశాడు. శుక్రవారమైన రెండో రోజు ఆటలో భాగంగా ఆఖరి ఓవర్లో పుజారా బంతితో మెరిశాడు. ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్మన్ మోహిత్ జంగ్రాను రెండో బంతికి పుజారా తన లెగ్ స్పిన్తో ఔట చేయడం ఆటకే హైలెట్గా నిలిచింది.
ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. తాను బ్యాట్స్మన్ నుంచి ఆల్రౌండర్గా ఎదిగానని సరదాగా కామెంట్ చేశాడు. అయితే పుజారా వికెట్ తీయడం పట్ల సహచర క్రికెటర్లు, అభిమానులు ఆనందంవ్యక్తం చూస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో ట్రోలింగ్కు దిగాడు. "అద్భుతంగా బౌలింగ్ చేశావు. నీ పరుగుల వేగానికి స్ర్పింటర్ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడు" అని కామెంట్ పెట్టాడు. రవిచంద్రన్ ఆశ్విన్ అయితే "అసాధారణం, ఇక మరింతగా బౌలింగ్ చేసే సమయం వచ్చింది" అంటూ కామెంట్ పెట్టాడు.
View this post on InstagramThe day when I changed my Batsman status to an All-rounder 😂😂
A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on
పుజారా ఇప్పటివరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 192 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఉత్తర ప్రదేశ్ ఇంకా బలమైన స్థితిలో ఉంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 331 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (57), ఓపెనర్ హర్విక్ దేశాయ్ (54) హాఫ్ సెంచరీలు చేశారు.