టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా తన ఫేలవ ఫామ్తోపాటు తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించాడు. ఫామ్లో లేకపోయినా తనకు ఇంత కాలం మద్దతుగా నిలిచిన టీం మేనేజ్మెంట్కు పుజారా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోలేదని చెప్పాడు. టీం కెప్టెన్తోపాటె హెడ్ కోచ్, కోచింగ్ బృందం, మిగతా ఆటగాళ్లు తనకు మద్దతుగా నిలిచారని తెలియజేశాడు. తాము కష్ట పడి ఆడాతామని, కానీ కొన్ని సందర్బాల్లో పరుగులు చేయలేకపోతామని పుజారా తెలిపాడు.
అటువంటి సందర్భాల్లో తమపై విమర్శలు రావడం సహజం అని ఈ సీనియర్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. ఒక క్రికెటర్గా ఇవన్నీ పట్టించుకోకుండా, మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని అన్నాడు. తాము ఎప్పుడూ బోర్డుపై మంచి స్కోర్ పెట్టడానికే ప్రయత్నిస్తామని తెలిపాడు. అలాగే బుధవారం సెకండ్ ఇన్నింగ్స్లో తాను సాధించిన హాఫ్ సెంచరీ పట్ల పుజారా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదే ఫామ్ కొనసాగించడానికి కచ్చితంగా కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రానున్న మ్యాచ్ల్లో తప్పకుండా భారీ స్కోర్లు సాధిస్తానని పుజారా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా దాదాపు రెండేళ్లుగా సరైన ఫామ్లో లేని చటేశ్వర్ పుజారా సౌతాఫ్రికా పర్యటనలోనూ అదే చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క బంతికే గోల్డెన్ డక్ కాగా, సెకండ్ ఇన్నింగ్స్లో 16 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో 3 పరుగులకే ఔట్ అయి మరోసారి నిరాశపరిచాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
ఇక జోహన్నెబర్గ్ టెస్టు మ్యాచ్ విషయానికొస్తే సౌతాఫ్రికా ముందు టీమిండియా 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దీంతో విజయానికి ఇంకో 122 పరుగుల దూరంలో ఉంది. 8 వికెట్లు తీసి సఫారీలను అడ్డుకుంటే భారత్ విజయం సాధిస్తుంది. దీంతో నాలుగో రోజు ఆటలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. క్రీజులో 46 పరుగులతో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్, 11 పరుగులతో డస్సెన్ ఉన్నారు. భారత జట్టు కూడా తమ పదునైనా పేస్ బౌలింగ్తో దాడి చేయడానికి సిద్దంగా ఉంది.