
హైదరాబాద్: వచ్చే ఏడాదిలో మరో క్రికెట్ అకాడమీ ప్రజల ముందుకు రానుంది. ఐపీఎల్ లీగ్కు రెండు సంవత్సరాల సస్పెన్షన్ తర్వాత మళ్లీ 2018లో ఆడబోతుంది. అదొక్కటే గాక, మరో కొత్త బాధ్యతను నెత్తి మీద వేసుకుంది. కొత్త టాలెంట్, ఎంతో మంది యువతను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా యోచిస్తుంది.
ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ డైరక్టర్ కే జార్జ్ మాట్లాడుతూ.. డిసెంబరు 26నుంచి జూనియర్ చైన్నై సూపర్ కింగ్స్ టీ 20 ఛాంపియన్ షిప్ జరగనున్నాయి. ఈ ఛాంపియన్ షిప్లో ఎనిమిది జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయని అన్నారు.
ఇలా అకాడమీలు ఏర్పాటు చేయడం ద్వారా కొత్త యువతకు ప్రోత్సాహంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. దీనికి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టుకు సంబంధించిన సిబ్బందినే తీసుకుంటామన్నారు. కాగా, సీఎస్కే తరపున ఇప్పటి వరకు ధోనీ, జడేజా, రైనాను తీసుకోవాలని జట్టు నిర్ణయించింది. మిగిలిన జట్టు సభ్యలు ఎవర్ని తీసుకోవాలనే నిర్ణయం తేలాల్సి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.