బెంగళూరు వేదికగా మరికొద్ది సేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయాల కారణంగా జట్టుకు దూరమైన చెన్నై కెప్టెన్ ధోనీ, ఆల్ రౌండర్ బ్రేవో జట్టులోకి వచ్చారు. మరోవైపు బెంగళూరు జట్టులోకి డివిలియర్స్, ఉమేష్ యాదవ్ వచ్చారు.
పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్లో ఉన్న చెన్నై ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ని ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరు.. చెన్నైపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. గడిచిన మ్యాచ్ ఫలితాన్నే పునరావృతం చేయాలని బెంగళూరు ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
MS Dhoni calls it right at the toss and elects to bowl first against the @RCBTweets.#RCBvCSK pic.twitter.com/dqfJtpQQSm
— IndianPremierLeague (@IPL) April 21, 2019
జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వెన్ బ్రేవో, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, అక్షదీప్ నాథ్, మొయిన్ ఆలీ, మార్కస్ స్టోయినిస్, పవన్ నేగీ, చాహాల్, డేల్ స్టేయిన్, నవ్దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్.