
హైదరాబాద్: సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఈ సీజన్లో ధోనీసేనతో తలపడిన సన్రైజర్స్ అన్నింటిలోనూ ఓటమిపాలైంది. హైదరాబాద్ను ఓడించడం ద్వారా ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిని నాలుగుసార్లు ఓడించిన తొలి జట్టుగా చెన్నై రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీజన్లో సన్రైజర్స్పై చెన్నై ఒకే తరహాలో చేధన మొదలుపెట్టింది.
హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో పవర్ ప్లేలో 27 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో చెన్నైకి ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. తర్వాత తొలి క్వాలిఫైయర్లో 33 రన్స్ చేసిన చెన్నై.. ఆదివారం జరిగిన ఫైనల్లో 35 పరుగులే చేసింది. మొత్తంగా మూడు మ్యాచ్ల్లో పటిష్టమైన బౌలింగ్ను మెల్లగా బ్యాటింగ్ మొదలుపెట్టిన ధోనీ సేన తర్వాత దూకుడుగా ఆడి విజయాలు సాధించింది.
ఫైనల్లో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న వాట్సన్.. పదకొండో బంతికి బౌండరీ బాది ఖాతా తెరిచాడు. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి 57 బంతుల్లోనే 117 పరుగులతో చెన్నైకి విజయాన్ని అందించాడు. వాట్సన్ విధ్వంసంతో 18.3 ఓవర్లలోనే చెన్నై సునాయసంగా గెలుపొందింది.
పేలవంగా మొదలైంది ఇన్నింగ్స్. సందీప్, భువనేశ్వర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టడం ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్లకు గగనమే అయింది. కానీ ఆరంభంలో పరుగుల కోసం చెమటోడ్చినా.. వాట్సన్కు రైనా (32) సహకరించడంతో లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.