లండన్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షిస్తారు. అదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు దాయాది దేశాలు తలపడుతున్నాయాంటే ఆ ఫీవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశాల ఫైనల్ మ్యాచ్కు వచ్చే ప్రకటనలకు భారీగా రేట్లు పెంచేశాయి టీవీ సంస్థలు.
ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ విరామ సందర్భాల్లో వచ్చే ప్రకలనకు 30 సెకన్లకే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం. 2007లో జరిగిన ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలబడిన భారత్-పాక్.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్పై 5వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ టీ20 ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.
ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను భారత్, పాక్ అభిమానులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది క్రికెట్ అభిమానులు టీవీల్లో వీక్షించనున్నారు. రేటింగ్ కూడా అమాంతంగా పెరిగే అకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సెకన్ల టీవీ ప్రకటనలకే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
జూన్ 4న గ్రూప్ దశలో ఈ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్ 124 పరుగుల తేడాతో గెలుపొందింది. రూటర్స్ కథనం ప్రకారం.. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల రేట్లను ఒకేసారి పది రేట్లు పెంచేసింది. దీంతో మ్యాచ్ సందర్భంగా యాడ్ ఇవ్వాలనుకుంటే ప్రకటనదారులు 30సెకన్లకే దాదాపు కోటి రూపాయలు చెల్లించక తప్పదన్నమాట.
India v Pakistan Final .... !!!!!!!! All TV execs around the World are now cracking a nice bottle open to celebrate ..... #IndiaToWin
— Michael Vaughan (@MichaelVaughan) June 15, 2017