
ప్రత్యేక పూజలు
ఈ మ్యాచ్లో మా జట్టు గెలవాలంటే మా జట్టు గెలవాలంటూ మ్యాచ్కి ముందు ఇరు జట్లకు చెందిన అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేతిలో టీమిండియా 124 పరుగుల తేడాతో చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో భావోద్వేగానికి గురైన పాక్ అభిమానులు మ్యాచ్ వీక్షించిన టీవీలను పగలకొట్టేశారు.

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మామూలే
ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై పాక్ ఎప్పుడు ఓడిపోయినా అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అక్కడ మామూలే. ఈ మ్యాచ్కి ముందు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొద్ది రోజుల క్రితం పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్తో త్వరలో జరిగే భారత్-పాక్ మ్యాచ్ కోసం పాక్ అభిమానులు టీవీలకు బదులు రేడియోలు కొనుగోలు చేయాలని సూచించాడు.

పాక్ అభిమానులకు సెహ్వాగ్ సలహా
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్తో కలిసి ఓ టెలివిజన్ ఛానల్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అభిమానులకు సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడు. పాక్ అభిమానులు ఈ సారి టీవీలకు బదులు రేడియోలు కొనుగోలు చేయాలంటూ తనదైన శైలిలో సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.

టీవీలను పగలగొట్టిన పాక్ అభిమానులు
జూన్ 4న ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్లో పాక్ ఓటమిపాలైన తర్వాత రేడియోలను పగలకొట్టొచ్చని దానివల్ల వారి జేబులకు పెద్ద స్థాయిలో నష్టం జరగదని సెహ్వాగ్ తనదైన శైలిలో చమత్కరించాడు. సెహ్వాగ్ చెప్పినట్లు పాక్ క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి తమ ఇళ్లలోని టీవీలను పగలగొట్టారు.


Click it and Unblock the Notifications











