పాకిస్థాన్లో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ ను ఓడించి విజయోత్సాహంలో అప్ఘానిస్థాన్.. తాజా మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే అప్ఘాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే రావల్పిండి వేదికగా ఆడేందుకు సిద్ధమైన ఆసీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్, పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ వరుణుడు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు లాహోర్ వేదికగా జరగనున్న అప్ఘాన్ - ఆసీస్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉంది. వర్షం పడకుండా మ్యాచ్ కొనసాగి ఫలితం వస్తే... గెలిచిన జట్టు నేరుగా సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది. అదే మ్యాచ్ రద్దైతే పరిస్థితి మరోలా ఉంటుంది.

వర్షం పడితే పరిస్థితి ఏంటి
లాహోర్ అప్ఘాన్ - ఆసీస్ మ్యాచ్ కు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు 35 శాతం ఛాన్స్ ఉండగా.. రాత్రిపూట భారీ వర్షం పడొచ్చని అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే ఆసీస్ కు కలిసొస్తుంది. ఆ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసేసుకుంటుంది. అఫ్గాన్ మూడు పాయింట్లతో టోర్నీ నుంచి వైదొలుగుతుంది.
ఇప్పటికే గ్రూప్ బీలో మూడు పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్ తో సంబంధం లేకుండా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే అప్ఘాన్ కన్నా సౌతాఫ్రికా నెట్ రన్రేట్ ఎక్కువగా ఉండటమే కారణం. అదే వర్షం పడకుండా తాజా మ్యాచ్ కొనసాగి అప్ఘానిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టుకే సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
𝐓𝐡𝐞 𝐖𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐒𝐞𝐥𝐟𝐢𝐞! 🤩🤳#AfghanAtalan | #ChampionsTrophy | #AFGvENG | #GloriousNationVictoriousTeam pic.twitter.com/BMxQ6t2xpd
— Afghanistan Cricket Board (@ACBofficials) February 26, 2025