8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన ఒప్పందం
1990, 2000 దశకంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్లకు స్పాన్సర్ చేసిన ఎంఆర్ఎఫ్, ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్లను స్పాన్సర్ చేస్తోంది. ఇంతకముందు కోహ్లీ పూమా సంస్థతో 8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కోహ్లీకి ఇది రెండో 100 కోట్ల డీల్
ఈ ఏడాది కోహ్లీకి ఇది రెండో 100 కోట్ల డీల్ కావడం విశేషం. కాగా ఇటీవలే ఫోర్బ్స్ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్ 100 క్రీడాకారుల జాబితాలో కోహ్లీ 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఎంఆర్ఎఫ్ డీల్తో కోహ్లీ తన ర్యాంకుని మరింత మెరుగుపరచుకోనున్నాడు.
పెప్సీకో తీవ్ర ప్రయత్నాలు
ఇదిలా ఉంటే ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తాను సేవించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.
రెండో సెమీ పైనల్లో బంగ్లాతో ఢీ
ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతోంది. జూన్ 15న టీమిండియా...బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన వార్మప్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం సాధించింది.