హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
పాక్ బ్యాట్స్మెన్లలో పకార్ జామన్ సెంచరీ (114) పరుగులతో చెలరేగగా, అజర్ అలీ 59, బాబర్ ఆజం 46, షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ హఫీజ్ 57, (నాటౌట్), ఇమాద్ వాసిమ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.
పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో పాక్ చేతిలో 180 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
టీమిండియా ఓటమికి కారణాలను క్రికెట్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు:
{photo-feature}