మరోసారి తెరపైకి ధోని రిటైర్మెంట్ వార్తలు
ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ధోని రిటైర్మంట్ వార్తలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించాడు. సచిన్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. రిటైర్మెంట్పై రూమర్లు వ్యాప్తి చేయకుండా టీమిండియాకు అతడు చేసిన సేవలను గౌరవించాలి. భారత క్రికెట్ అతడు ఎంతో చేశాడు. రిటైర్మెంట్పై నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అతడికే వదిలేయండి" అని అన్నాడు.
ధోనిపై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్
ఇక, ధోని లాంటి కెరీర్ ఎంతమంది ఆటగాళ్లకు ఉంటుందని సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ధోనీలాంటి కెరీర్ ఎవరికి ఉంటుంది?. అతడిది ఓ ప్రత్యేకమైన కెరీర్. అభిమానులు అతడికి ఇచ్చిన మద్దుతు, పెట్టుకున్న నమ్మకం అతడి కృషికి ప్రతిబింబం. ఇప్పటికీ అభిమానులు అతడు గేమ్ను ఫినిష్ చేయగలడని భావిస్తున్నారు. గేమ్ ఇప్పటికీ ముగియలేదు" అని సచిన్ అన్నాడు.
9 మ్యాచ్లు ఆడిన 273 పరుగులు
ఈ ప్రపంచకప్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడిన ధోని 45.5 యావరేజితో 273 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లతో జరిగిన మ్యాచ్ల్లో పరుగులు రాబట్టేందుకు ధోని తెగ ఇబ్బంది పడ్డాడు. ఆప్ఘన్తో జరిగిన మ్యాచ్లో ధోని డకౌట్గా వెనుదిరిగాడు.
జడేజాతో కలిసి ధోని 106 పరుగుల భాగస్వామ్యం
అయితే, బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో రవీంద్ర జడేజాతో కలిసి ధోని 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన వేళ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా ఆడాడు.