బెంగళూరు: కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో న్యూజిలాండ్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో భాగం సోమవారం జరిగిన నాలుగో వన్డే మ్యాచులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-2తో సిరీస్ను సమం చేసింది.
కివీస్ నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్ ను ఇండియా టీమ్ 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మిథాలీ రాజ్ అజేయ అర్ధసెంచరీతో కదం తొక్కింది. 88 బంతుల్లో 10 ఫోర్లతో 81 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని మిథాలీ అందుకుంది. 5వేల పరుగులు దాటిన తొలి భారత మహిళా క్రికెటర్గా మిథాలీ రికార్డు సృష్టించారు.

స్మృతి మంధన(66) కూడా అర్ధసెంచరీతో రాణించింది. కామిని 31, కౌర్ 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది.
నిరంజన 3, గైక్వాడ్ 3, కౌర్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్లో రెండు జట్లు రెండేసి మ్యాచ్లు గెలిచాయి. చివరి మ్యాచ్ బుధవారం జరుగుతుంది.