RCB vs PBKS: ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ సారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. "ఈసాలా కప్ నమ్దే" సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆశ్చర్యకరంగా కెనడియన్ ర్యాపర్ డ్రేక్ కూడా ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నట్లు కనిపించింది. ఆర్సీబీకి మద్దతు ఇవ్వడానికి డ్రేక్కు పెద్ద కారణం ఉంది. అతను ఆర్సీబీపై మిలియన్ల డాలర్ల పందెం వేశాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్పై బిలియన్ డాలర్లకు పైగా పందెం వేయబడిందని నిపుణులు భావిస్తున్నారు. అభిమానులు మ్యాచ్ రిజల్ట్, టాప్ స్కోరర్, ప్రతి బంతిపై ఏమి జరగుతుందో కూడా పందెం వేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో మిలియన్ల డాలర్లు పందెం వేయబడతాయని అంచనా. కొంతమంది కొద్ది మొత్తంలో పందెం వేస్తుండగా.. మరికొందరు వేల డాలర్లు పందెం వేస్తున్నారు. కెనడియన్ ర్యాపర్ డ్రేక్ మాత్రం మిలియన్ల డాలర్లు పందెం వేశాడు.

మంగళవారం ఇన్స్టాగ్రామ్లో డ్రేక్ ఒక స్క్రీన్ షాట్ను పంచుకున్నాడు. దీనిలో ర్యాపర్ డ్రేక్ ఐపీఎల్ 2025 విజేతపై 750000 యూఎస్ డాలర్లు అంటే రూ.6.41 కోట్లు పందెం వేసినట్లు చూపించాడు. ఆర్సీబీ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టును ఓడిస్తే.. డ్రేక్కు 1.312 మిలియన్ డాలర్లు అంటే రూ.11.21 కోట్లు లభించనుంది. బహుశా అందుకే డ్రేక్ "E Sala Cup Namde" అని క్యాప్షన్లో రాశాడు. కెనడియన్ ర్యాపర్ డ్రేక్ క్రికెట్పై బెట్టింగ్ వేయడం చూసి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే క్రికెట్ అక్కడ అంతగా ప్రాచుర్యం పొందలేదు.
ఈ ఏడాది ఐపీఎల్ కొత్త ఛాంపియన్ను పొందుతుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండూ 2008 నుంచి లీగ్లో భాగంగా ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆర్సీబీ 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. విరాట్ కోహ్లీ ఈ ఏడాది మంచి ఫామ్లో ఉన్నాడు. 600 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ ఆర్సీబీ ముందు బలమైన పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. ఈ సారి బలంగా కనిపిస్తోంది. ఈ సారి ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి 1,25,000 సామర్థ్యం గల స్టేడియానికి చాలా మంది బాలీవుడ్ స్టార్లు హాజరుకానున్నారు.