
హైదరాబాద్: కపిల్దేవ్ బౌలింగ్లో ఎలా ఆడాలో అజారుద్దీన్ కోచింగ్ ఇచ్చాడు. ఇక అజారుద్దీన్ వేసిన బంతులని సరదాగా ఆడేశారు ఆ క్రికెటర్లు. ఆ బ్యాట్స్మెన్లు విదేశీయులు. భారత్లో పర్యటించేందుకు వచ్చిన ప్రధాని కొడుకులు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు కెనడా దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో శనివారం ఇండియాకి విచ్చేశారు. ఆగ్రాలోని తాజ్మహల్, గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
కుటుంబ సమేతంగా విచ్చేసిన కెనడా ప్రధాని కుటుంబం క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించారు. దీంతో భారత దిగ్గజ క్రికెటర్లు వారిని ఆడించేందుకు సన్నద్ధమయ్యారు. అజారుద్దీన్ పక్కను ఉండి గైడ్ చేస్తుంటే కపిల్ దేవ్ బౌలింగ్ చేసి వాళ్లతో ఆడారు.
శుక్రవారం పర్యటనలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలో పాల్గొంటారు. ఈ చర్చలో శక్తి వనరులు, సైన్సు, ఉన్నత విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై చర్చించనున్నారు.