న్యూఢిల్లీ: ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఓటమికి ఐపియల్ కారణం కాదని భారత ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. వెస్టిండీస్ పబ్ లో భారత క్రికెటర్లు గలాటాకు దిగినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.చాలా మంది చాలా అంటుంటారని, తమ పట్ల అవాంఛనీయ సంఘటనేది జరగలేదని ఆయన అన్నారు. డిన్నర్ చేయడానికి హోటల్ కు వెళ్లామని, వెస్టిండీస్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ ను తాము చూశామని, మిగతా విషయాలేమీ తనకు తెలియదని ఆయన అన్నారు. కెప్టెన్ ధోనీకి నెహ్రా మద్దతుగా మాట్లాడారు. ధోనీ కెప్టెన్సీలో తాము టెస్టుల్లో నెంబర్ వన్ గా, వన్డేలో నెంబర్ టూగా అవతరించామని, గత 18 నెలలుగా తాము బాగా ఆడుతున్నామని ఆయన అన్నారు.