IND vs PAK: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు రానే వచ్చింది. ప్రపంచమంతా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ గురించే చర్చించుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య గొప్ప మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ పాకిస్థాన్ను 60 పరుగుల తేడాతో ఓడించింది.
మరోవైపు భారత జట్టు ఛాంఫియన్స్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ప్రతిసారీ లాగా ఈ సారి కూడా భారత జట్టు ఈ మ్యాచ్ గెలవడానికి ఫేవరేట్ గా పరిగణించబడుతోంది. రెండు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా?

చివరిసారి తలపడింది అప్పుడే..
వన్డే ఫార్మాట్లో 2023 ప్రపంచ కప్లో దాయాది జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. కేవలం 42.5 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ముందు పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తరఫున బాబర్ ఆజం అత్యధికంగా 50 పరుగులు చేశాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలో 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్ శర్మ 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 19 పరుగులు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ నాటౌట్ గా డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ పాకిస్థాన్ బౌలర్లను చిత్తు చేశాడు. రోహిత్ బ్యాట్ నుంచి 6 ఫోర్లు, 6 సిక్సర్లు వచ్చాయి.
ఇప్పుడు మరోసారి ఇరు జట్లు వన్డే ఫార్మాట్ లో తలపడనున్నాయి. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. దీన్ని చూస్తుంటే ఈ మ్యాచ్ లో కూడా భారత్ పాకిస్థాన్ ను ఓడిస్తుందేమో అనిపిస్తోంది.