న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదిలోనే ఆటంకం ఎదురైనా.. సెహ్వాగ్‌లా ఐదోసారి కూడా.. బట్లర్

Buttler equals Sehwags record with 5th straight IPL fifty

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్, ముంబైకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌​ జోస్‌ బట్లర్‌ మరో కీలక ఇన్నింగ్స్‌తో ఐపీఎ‍ల్‌-11వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేయడంతో ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి బట్లర్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

 మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జోస్‌ బట్లర్‌‌

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జోస్‌ బట్లర్‌‌

మ్యాచ్‌ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జోస్‌ బట్లర్‌‌ (94) మీడియాతో మాట్లాడాడు. ‘నేడు నా కల సాకారమైంది. మిడిలార్డర్‌లో ఆడే నేను ఓపెనింగ్‌లో కూడా రాణించాలనుకున్నా. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ తరఫున ఆడి ఇది నిజం చేసుకున్నా. నా ఫామ్‌ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా. మిడిలార్డర్‌లో ఎక్కువగా ఆడే నేను.. ఇన్నింగ్స్‌ చివరివరకూ ఉండాలని ముందే నిర్ణయించుకుని బ్యాటింగ్‌కు దిగా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ముంబైని కీలక సమయంలో నిలువరించారని' ప్రశంసించాడు.

 ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో

ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆరు విజయాలు, 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకున్నట్లు కనిపించిన ముంబై ఇండియన్స్‌కు సొంతగడ్డపై బ్రేక్‌ పడింది. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు పోరాడి గెలిచారు.

 బౌలర్లు బంతితో కట్టడి చేయగా..

బౌలర్లు బంతితో కట్టడి చేయగా..

ముందుగా బౌలర్లు బంతితో కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ బట్లర్‌ (94) మరోసారి చివరి వరకూ నిలిచి ముంబై నిర్దేశించిన 169పరుగుల లక్ష్యాన్ని మరో 12బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చి.. ప్లే ఆఫ్‌ అవకాశాలను పదిలం చేశాడు. ఫలితంగా రాజస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ముంబైపై అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్‌ దాదాపు ప్లేఆఫ్స్‌కు దూరమైనట్లే.

 ఆదిలోనే ఆటంకం ఎదురైనా

ఆదిలోనే ఆటంకం ఎదురైనా

ముంబై నిర్ధేశించిన 169పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. షార్ట్‌ (4) తొలి ఓవర్‌ చివరి బంతికి బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బట్లర్‌తో జత కలిసిన రహానె (37) స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు బట్లర్‌ కూడా భారీ సిక్సర్లు, బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ 14ఓవర్‌ తొలి బంతికి రహానె..సూర్యకుమార్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం సంజూ శాంసన్‌ (14)తో కలిసి బట్లర్‌ మంచి ముగింపును ఇచ్చారు.

Story first published: Monday, May 14, 2018, 11:04 [IST]
Other articles published on May 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X