మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జోస్ బట్లర్
మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జోస్ బట్లర్ (94) మీడియాతో మాట్లాడాడు. ‘నేడు నా కల సాకారమైంది. మిడిలార్డర్లో ఆడే నేను ఓపెనింగ్లో కూడా రాణించాలనుకున్నా. ఐపీఎల్లో రాజస్తాన్ తరఫున ఆడి ఇది నిజం చేసుకున్నా. నా ఫామ్ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా. మిడిలార్డర్లో ఎక్కువగా ఆడే నేను.. ఇన్నింగ్స్ చివరివరకూ ఉండాలని ముందే నిర్ణయించుకుని బ్యాటింగ్కు దిగా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ముంబైని కీలక సమయంలో నిలువరించారని' ప్రశంసించాడు.
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో
ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆరు విజయాలు, 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకున్నట్లు కనిపించిన ముంబై ఇండియన్స్కు సొంతగడ్డపై బ్రేక్ పడింది. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు పోరాడి గెలిచారు.
బౌలర్లు బంతితో కట్టడి చేయగా..
ముందుగా బౌలర్లు బంతితో కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్ బ్యాట్స్మెన్ బట్లర్ (94) మరోసారి చివరి వరకూ నిలిచి ముంబై నిర్దేశించిన 169పరుగుల లక్ష్యాన్ని మరో 12బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చి.. ప్లే ఆఫ్ అవకాశాలను పదిలం చేశాడు. ఫలితంగా రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ముంబైపై అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ దాదాపు ప్లేఆఫ్స్కు దూరమైనట్లే.
ఆదిలోనే ఆటంకం ఎదురైనా
ముంబై నిర్ధేశించిన 169పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. షార్ట్ (4) తొలి ఓవర్ చివరి బంతికి బుమ్రా బౌలింగ్లో వికెట్కీపర్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బట్లర్తో జత కలిసిన రహానె (37) స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు బట్లర్ కూడా భారీ సిక్సర్లు, బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ 14ఓవర్ తొలి బంతికి రహానె..సూర్యకుమార్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం సంజూ శాంసన్ (14)తో కలిసి బట్లర్ మంచి ముగింపును ఇచ్చారు.