|
ఆస్ట్రేలియా వరుస ఓటముల నేపథ్యంలో
అయితే దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా వరుస ఓటముల నేపథ్యంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ క్రికెట్ ఆస్ట్రేలియాను అభ్యర్థించింది. అయితే నిషేధం విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని సీఏ తేల్చి చెప్పింది.
6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (33), ఫించ్ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్ (25 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.
డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్
ఓపెనర్ శిఖర్ ధావన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 22 నాటౌట్) రాణించారు. ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.